లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం పర్మిషన్ తో నిన్న చంద్రబాబు ఏపీ చేరుకున్నారు. విమానయానం లేకపోవడంతో రోడ్డు మారగానే వెళ్లిన ఆయనకి దారిలో పలు చోట్ల టిడిపి కార్యకర్తలు భారీగా గుమికూడి స్వగతం పలికారు. ఆయన కూడా తన వెహికల్ ఆపి వారికి అభివాదం చేశారు. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీటినే ఆధారంగా చూపి చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పరోక్షంగా కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన మొమమ్మద్ అలీ అనే వ్యక్తి ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు పై కేసుని నమోదు చేశారు. మరో వైపు చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి డైరెక్ట్ గా హైకోర్టుకే ఫిర్యాదు చేసి చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నేడు చంద్రబాబు వైజాగ్ స్టెరీన్ గ్యాస్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు.
728713 877453Oh my goodness! a fantastic post dude. Numerous thanks Nonetheless We are experiencing dilemma with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody discovering identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 427710
663924 867404I consider something actually particular in this internet site. 392387