రాజస్థాన్ రాష్ట్రం ఝుంఝును జిల్లాలో దారుణం జరిగింది. ఈనెల 20వ తారీకున ఒక వివాహిత అత్తారింటి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు మీద పెట్రోల్ పోసుకుంది. ఆ విషయం గమనించిన భర్త ఆమెను ఆపే ప్రయత్నం చేయకుండా కేసు తనపైకి రావద్దనే ఉద్దేశ్యంతో ఆమె అరుస్తూ ఉండటంను వీడియో తీశాడు.
ఆ తర్వాత ఆ వీడియోను వివాహిత కుటుంబ సభ్యులకు పంపించాడు. అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు అతడిపై కేసు పెట్టారు. తీవ్రంగా గాయాలు అయిన ఆమె రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను కాపాడకుండా ఆమెను వీడియో తీసుకుంటూ ఉన్నాడు.
కనుక అతడు పరోక్షంగా ఆమె మృతికి కారణం అంటూ పోలీసులు అనుమానంతో కేసు బుక్ చేయడంతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గృహ హింస మరియు హత్య కేసును కూడా కేడా నమోదు చేయడం జరిగింది.