సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం దగ్గరనుండి, సామజిక అంశాలపై స్పందించడం వరకూ మహేష్ సోషల్ మీడియాను ఎఫెక్టివ్ గా వాడుతుంటారు. కరోనా కష్ట సమయంలో కూడా మహేష్ బాబు ప్రజలకు అవగాహన కలిగించడానికి తన ఫ్యాన్స్ తో టచ్ లోకి రావడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు ఇప్పుడు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ట్విట్టర్ లో మహేష్ ఫాలోయింగ్ 10 మిలియన్లు దాటేసింది. ఈ అరుదైన రికార్డ్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా మహేష్ రికార్డు సాధించాడు.
మరే తెలుగు హీరో కూడా మహేష్ కు దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. గత ఐదు నెలలుగా మహేష్ నుండి సినిమా లేకపోయినా కానీ ఫాలోయర్ల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మహేష్ ఛరిస్మాకు ఇది అద్దం పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్, తన తర్వాతి చిత్రంగా సర్కారు వారి పాటను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు. కీర్తి సురేష్ కథానాయిక.
937142 79040Some truly marvelous work on behalf of the owner of this internet site , dead great articles . 271359