Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌ లేకపోయి వుంటే, మార్చి నెలాఖరునే ఇళ్ళ పట్టాలు పేదలకు ఇచ్చేసి వుండాలి. ఏకంగా 30 లక్షల ఇళ్ళ పట్టాల్ని ఇవ్వాలన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పం.

అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి స్థలాల సేకరణ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్ళు కట్టించడం జరిగింది. కానీ, వాటిల్లో చాలావరకు లబ్దిదారులకు చేరలేదు. కొన్ని కేటాయింపులు జరిగినా, ఆ కేటాయింపులు గందరగోళంగా తయారయ్యాయి. పేదవాడికి గూడు కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమైతే, గడచిన ఏడాది కాలంలో ఈ ప్రక్రియను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొనసాగించి వుండేదే.

సరే, కారణాలేవైతేనేం.. జులై 8వ తేదీన ముహార్తం పెట్టుకున్నారు. కానీ, ఈలోగా బోల్డన్ని ఆరోపణలు. అందులో, ఇళ్ళ స్థలాల పేరుతో 20 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల దాకా పేదల నుంచి అధికార పార్టీ నేతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలే ఎక్కువ. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ విషయమై సంచలన ఆరోపణలు చేశారు. ‘స్థలాల ధరలు ఎక్కువ అవడంతో..’ అనే సాకు చూపి, స్థానిక వైసీపీ నేతలే రంగంలోకి దిగి, ఈ వసూళ్ళకు పాల్పడుతున్నారంటూ ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఘాటైన ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో దీనికి సంబంధించి నిత్యం కథనాలు చూస్తూనే వున్నాం.

మరోపక్క, లబ్దిదారుల్లో ఎక్కువగా వైసీపీ మద్దతుదారులే వుంటున్నారనీ, నిజమైన లబ్దిదారులకు చోటు దక్కడంలేదన్న ఆరోపణలూ లేకపోలేదు. అయితే, ఇదంతా విపక్షాల కుట్ర అనీ, ఇళ్ళ స్థలాల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

నిజానికి, ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడమంటే ఇదొక చారిత్రక ఘట్టంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. పారదర్శకంగానే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడితే.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ, వెల్లువెత్తుతున్న ఆరోపణలు.. స్థలాలు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పేదల మాటలే నిజమైతే.. అది ప్రభుత్వానికి మాయని మచ్చగా మారుతుందన్నది నిర్వివాదాంశం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...