కరోనా కారణంగా పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. సరదగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇక స్కూళ్లు, కాలేజీలు, పరీక్షల సంగతి సరేసరి. వేసవి సెలవుల ముందు జరగాల్సిన పరీక్షలన్నీ ఈ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఇదేదో సద్దుమణిగితే పరీక్షలు పెడదామని భావించినా.. సమీప భవిష్యత్తులో ఇది జరిగే పరిస్థితి కనిపించడంలేదు.
దీంతో చాలా రాష్ట్రాలు పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పదో తరగతి, ఇంటర్ విషయంలో ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నాయి. ఇక డిగ్రీ, పీజీ కోర్సుల విషయంలో చివరి ఏడాది మినహా మిగిలిన సంవత్సరాల విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. తెలంగాణలో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు చివరి సంవత్సరం పరీక్షలు ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులు తమ ఇంట్లో కూర్చునే పరీక్షలు రాయొచ్చు. జవాబుల కోసం పుస్తకాలు కూడా రిఫర్ చేసుకోవచ్చు. అంటే ఓపెన్ బుక్ విధానంలో పరీక్షల నిర్వహణ అన్నమాట. ఇంట్లో కూర్చుని పరీక్ష అంటే అందరూ చేసే పని అదేననుకోండి. అసలు పరీక్షలు లేకుండా పాస్ చేయడం కన్నా ఇది చాలా బెటరనే నేపథ్యంలో సీఎం చౌహాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలు రాసిన తర్వాత విద్యార్థులు తమ సమాధానపత్రాలను తమకు సమీపంలోని పేపర్ కలెక్షన్ సెంటర్లలో అందజేయాలి. అంతేకాకుండా పోస్టు ద్వారా కూడా పంపించే వెసులుబాటు కల్పించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల క్షేమంతోపాటు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చౌహాన్ వెల్లడించారు. మరి మధ్యప్రదేశ్ బాటలో ఇంకా ఎన్ని రాష్ట్రాలు పయనిస్తాయో చూడాలి.
251478 133897This style is incredible! You certainly know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (effectively, almostHaHa!) Amazing job. I genuinely loved what you had to say, and far more than that, how you presented it. Too cool! 681415