Switch to English

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో గెలుపోటములకు సంబంధించి, కింది స్థాయిలో అనేక వ్యవహారాలు నడుస్తుంటాయ్.

కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు.? అసలు, ఆమెను లోక్ సభ నుంచి అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు దించారు.? అంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు గనుక.. అన్నది అప్పట్లోనే వినిపించిన వాదన.

భీమవరం, గాజువాక, తిరుపతి.. ఇలా మూడు నియోజకవర్గాల చుట్టూ నానా రకాల ఈక్వేషన్స్ వేసుకుని, చివరికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పైకి కనిపించిన వ్యవహారమిది. తెరవెనుక ఎప్పటినుంచో.. అంటే, 2019 ఎన్నికల సమయంలోనే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచన చేసిన జనసేనాని, అప్పటికి కుదరకపోయినా.. ఆ తర్వాత నుంచీ పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెడుతూ వచ్చారు.

సరే, అదంతా గతం. పోలింగ్ డేట్ సమీపించేస్తోంది. పిఠాపురంలో జనసేనాని గెలుపు అంత తేలిక కాదు.. అనే వైసీపీ ప్రచారం నుంచి, పవన్ కళ్యాణ్‌కి 30 వేల ఓట్ల మెజార్టీ రావొచ్చని వైసీపీ నేతలే చెప్పే పరిస్థితి వచ్చింది. దీన్ని పిఠాపురం స్థానిక ప్రజలు ఎలా చూస్తున్నారంటే, ‘వంగా గీతకి డిపాజిట్లు కూడా రావు’ అనేంతలా.

ఎందుకిలా జరిగింది.? ఇదే నిజమవుతుందా.? ఇలా చాలా ప్రశ్నలు వైసీపీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వంగా గీత ఎన్నికల ప్రచారానికి వెళుతోంటే, ‘ఎంపీగా ఏనాడూ మా సమస్యల్ని పట్టించుకోలేదు. ఇప్పుడెందుకు వస్తున్నావ్.?’ అంటూ జనం నిలదీస్తున్నారు.

రోడ్లు బాగా లేవు.. అభివృద్ధి లేదు.. ఇలా సమస్యలు ఏకరువు పెడుతూ, దానికి కారణం వైసీపీ పాలనేనని జనం నిలదీస్తుండడంతో, ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు వంగా గీతకి. ‘కాపు మహిళ’ అన్న కోణంలో తనకు కాపు సామాజిక వర్గం అండగా వుండాలనే స్థాయికి వంగా గీత రాజకీయం పడిపోయింది.

అయితే, ఇక్కడా ముద్రగడ పద్మనాభం ‘ప్రాపర్టీ’ వ్యాఖ్యలతో, వంగా గీత పేరు మరింత పలచనైపోయింది పిఠాపురం రాజకీయాల్లో. డిపాజిట్లు రానంత ఘోర పరాజయం వుండకపోవచ్చుగానీ, వంగా గీతకి మాత్రం పరాజయం తప్పదు. ఓడిపోయాక, వంగా గీత వైసీపీని వీడి, జనసేనలో చేరిపోవేడమే మంచిదన్న వాదన పిఠాపురంలో.. అందునా, కాపు సామాజిక వర్గంలో ప్రముఖంగా వినిపిస్తోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...