దర్శకుడు క్రిష్ కు అల్లు అరవింద్ ఓటిటి సంస్థ ఆహాతో డీల్ ఉన్న విషయం తెల్సిందే. ఈ డీల్ లో భాగంగా క్రిష్ వెబ్ సిరీస్ లను నిర్మించాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ లకు క్రిష్ కథ అందించనున్నాడు. దర్శకత్వం వేరే వాళ్ళు చేసినా క్రిష్ అన్నీ తానై ఈ వెబ్ సిరీస్ లను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే మస్తీస్ పేరిట ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన సంగతి తెల్సిందే. దీనికి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ప్రస్తుతం క్రిష్ ఆహా కోసం ఒక విమెన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ కు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడు క్రిష్.
రకుల్ ప్రీత్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. తెలుగులో తిరిగి బిజీ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. నితిన్ సరసన చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న చెక్ చిత్రమొకటే ఆమె చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే రకుల్ ను కలిసి వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ గురించి క్రిష్ వివరించాడని టాక్. రకుల్ సానుకూలంగానే ఉన్నా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.
మరోవైపు క్రిష్ పవన్ కళ్యాణ్ తో జానపద నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాను తెరకెక్కించాల్సి ఉంది. షూటింగులు లేని కారణంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది.
654973 92132hey very good internet site i will definaely come back and see once more. 426595
277879 6112I like what you guys are up also. Such intelligent work and reporting! Maintain up the superb works guys Ive incorporated you guys to my blogroll. I think itll improve the value of my internet site . 474363