ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
ఇప్పుడాయన, పూర్తిగా వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయినట్టున్నారు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మారిపోయారని అనుకోవచ్చా.? ఏమో, ఇలా మారడానికి నాగేశ్వర్, వైసీపీ నుంచి ఎలాంటి ప్రత్యేక హామీలు పొందారో ఏమోనన్న చర్చ సర్వత్రా జరుగుతోందండోయ్.!
అసలు విషయమేంటంటే, భూమి హక్కు పత్రాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోల విషయమై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఓ సామాన్యుడు, సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని ఎన్నికల ప్రచారంలో ఈ విషయమై నిలదీశాడు. దీన్ని ప్రజా చైతన్యంగా భావించాల్సి వుంటుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. పాలకులంటే సేవకులు మాత్రమే.! అలాంటిది, ప్రభువుల భూములకు సంబంధించిన హక్కు పత్రాల మీద సేవకుల ఫొటోలేంటి ఛండాలంగా.? అన్నది సామాన్యుడి ప్రశ్న. సామాన్యుడిలో ఈ చైతన్యం, పాలకులకు మరణ శాసనం కిందే లెక్క.!
నిజానికి, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ అంశంపై ఇలాగే విశ్లేషించాలి. అది పద్ధతి.! కానీ, ఆయన పద్ధతి తప్పారు. ‘భూమి హక్కు పత్రాల్ని ఇచ్చేది ప్రభుత్వమే కాబట్టి, ఆ ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ ఫొటోలు ఆ పత్రాలపై వుండటం సబబే.. అది తప్పు కాదు..’ అని తీర్పునిచ్చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్.
భూమి హక్కు పత్రాలంటే, ఐదేళ్ళకోసారి ఇచ్చేవి కావు. శాశ్వత హక్కు పత్రాలు అవి. సరే, వాటిని ఎవరైనా విక్రయిస్తే, కొత్త పత్రాలు ప్రభుత్వం ద్వారా వస్తాయన్నది వేరే చర్చ. ప్రభుత్వం మారిన ప్రతిసారీ, ఆ పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటో మారితే ఎలా వుంటుంది.? ఎంత అసహ్యంగా వుంటుంది.?
ప్రజాధనంతో పాలకులు పబ్లిసిటీ స్టంట్లు చేయకూడదు.! ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు ఏ పాలకుడికీ లేదు.! ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటోళ్ళు చెప్పాల్సిన తీరు.! కానీ, దురదృష్టం, పాలకుల పబ్లిసిటీ స్టంట్లకు కొమ్ము కాస్తున్నారు. కామెడీ ఏంటంటే, విద్యార్థుల మార్కుల లిస్టులపై విద్యాశాఖాధికారి సంతకం వుంటుంది కదా.. అంటూ, ముఖ్యమంత్రి ఫొటో వ్యవహారంపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం ప్రొఫెసర్ నాగేశ్వర్కే చెల్లింది.
Very good post. I certainly love this site. Thanks!