Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియమించారు. పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని బాధ్యతగా భావిస్తున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఈమేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘శ్రీ పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు. జనసేన ఎన్నికల ప్రచార పర్యవేక్షణకు, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా కల్యాణ్ గారు నన్ను నియమించడం సంతోషంగా ఉంది. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా అధినేత సూచించారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేస్తాను. దీనిని బాధ్యతగా తీసుకుని ఎన్నికల్లోనే కాకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, కూటమి అభ్యర్ధుల గెలుపునకు కృషి చేస్తాన’ని ప్రకటించారు.
పవన్ కల్యాణ్ తో గతంలో ఖుషి, బంగారం సినిమాలు తెరకెక్కించిన రత్నం ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు. ఇటివలే టీజర్ విడుదలై పవన్ అభిమానులు, ప్రేక్షకులను అలరించింది.
Thank you JSP chief @PawanKalyan garu for giving me such a great opportunity, as Campaign Secretary. As per your direction, I will work hard in the Tirupathi area constituencies for the victory of coalition and party candidates. @JanaSenaParty pic.twitter.com/ODPgR0g614
— AM Rathnam (@AMRathnamOfl) May 5, 2024