కర్ణాటక రాజధాని బెంగళూరు అల్లర్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడినది. ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో నిన్న రాత్రి సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. డీజేహల్లి, కేజీహల్లి ప్రాంతాల్లో జరిగిన ఈ అల్లర్లలో దాదాపుగా మూడు వేల మంది పాల్గొన్నట్లుగా పోలీసులు నిర్థారించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించడం జరిగింది. ఈ ఆందోళనకు కారణం సోషల్ డెమోక్రటిక్ పార్టీ అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే పోలీసులు ఎస్డీపీఐ నేత మజామ్మిల్ భాషను అరెస్ట్ చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ అల్లర్లు అప్పటికి అప్పుడు జరిగి ఉంటాయని మొదట భావించినా కూడా పోలీసుల విచారణలో వెలువడుతున్న విషయాల ప్రకారం చాలా రోజులుగా ఈ అల్లర్లకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో పరిస్థితి అదులో ఉందని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామంటూ రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది.
ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప ఆసుపత్రిలో ఉన్నా బెంగళూరు అల్లర్ల నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
#Bengaluru ఒక్కసారిగా భగ్గుమంది
🔹#MLA శ్రీనివాస మూర్తి మేనల్లుడు మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఉన్న పోస్ట్ను చూసి వందలాది మంది నిన్న రాత్రి #DJHalli Police Station, ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి నిప్పు అంటించారు
🔹 కాల్పుల్లో 2 మృతి.. 60 మంది పోలీసులు గాయపడ్డారు#bengalururiots pic.twitter.com/ppVIiwdmHf
— TeluguBulletin.com (@TeluguBulletin) August 12, 2020
965006 766663Outstanding weblog here! Also your internet website loads up quickly! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as speedily as yours lol 598801