‘సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తి చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్ళ పాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యాం పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్..’ ఇదీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి తెలుగుదేశం పార్టీపై వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన తాజా ఆరోపణ.
రాజకీయాల్లో ఆరోపణలు సహజం. పోలవరం ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ‘ఏటీఎం’లా వాడేసుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు గతంలో. కానీ, కేంద్రం అసలు పోలవరం ప్రాజెక్టులో అవినీతి అనేదే జరగలేదని తేల్చేసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. నిధులు కేంద్రమే ఇస్తుంది.. నిర్మాణాన్ని రాష్ట్రం చేపడుతుంది.. పర్యవేక్షణ మళ్ళీ కేంద్రం అజమాయిషీలోనే వుంటుంది.
సో, పోలవరం విషయంలో ప్రధాని మోడీ ఆరోపణలు చేసినా, బీజేపీ భగ్గుమన్నా.. అదంతా జస్ట్ రాజకీయమే. నిజానికి, పోలవరం వంటి ప్రాజెక్టుల విషయంలో ‘రాజకీయం’ అస్సలేమాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. కేంద్రం, యుద్ధ ప్రాతిపదికన నిధుల్ని మంజూరు చేసి వుంటే, పోలవరం ఏనాడో పూర్తయ్యేది. చంద్రబాబు సరిగ్గా అడగలేదు, బీజేపీ సీరియస్గా పట్టించుకోలేదు. అలా పోలవరం.. ఇంకా ఇంకా సాగుతూనే వుంది.
ఇక, విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాఫర్ డ్యాం.. సగం కొట్టుకుపోయిన మాట వాస్తవమేనా.? ఇది ఆషామాషీ ఆరోపణ కాదు.చాలా చాలా సీరియస్ అంశం. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది కాఫర్ డ్యాం. అది ఎప్పుడు కొట్టుకుపోయింది.? అన్నది తేలాల్సి వుందిప్పుడు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక.. ఆ బాధ్యత కేంద్రానిదే. చంద్రబాబు మీద ఆరోపణలు చేసే క్రమంలో, విజయసాయిరెడ్డి.. కేంద్రాన్ని గట్టిగానే కెలికేసినట్లు కన్పిస్తోంది. పోలవరం చంద్రబాబుది కాదు.. మోడీది కాదు.. వైఎస్ జగన్ది అసలే కాదు. అది ప్రజల సొమ్ముతో.. ప్రజల కోసం నిర్మితమవుతున్న ప్రాజెక్టు. దేశంలో సమీప భవిష్యత్తులో ఇలాంటి ఓ గొప్ప ప్రాజెక్టు ఇంకోటి నిర్మితమయ్యే అవకాశమే లేదు. అలాంటప్పుడు, పోలవరం ప్రాజెక్టుని ఎంత ప్రతిష్టాత్మకంగా భావించాలి.? దురదృష్టవశాత్తూ రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లు.. పోలవరం ప్రాజెక్టుని ఓ పొలిటికల్ ఏటీఎంలా అన్ని రాజకీయ పార్టీలూ వాడేస్తూ.. ఆ ప్రాజెక్టుకి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు.
నీ ఐదేళ్లపాలన కమీషన్లకోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు.
పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు.
ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్.— Vijayasai Reddy V (@VSReddy_MP) August 11, 2020
473334 573203i always enjoy to do weblog hopping and i stumbled upon your blog .”~; 621975
965797 953034I genuinely like your writing style, excellent details, appreciate it for posting : D. 82578