కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు కాకపోవచ్చు. కానీ, ఇంకొకరిపై విషం చిమ్మడం.. వ్యభిచారం కంటే హీనం.!
మెగాస్టార్ చిరంజీవి, గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ నేత. రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, కాంగ్రెస్ పార్టీలో ఏనాడూ ఆయన కొనసాగింది లేదు. అసలు ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. కాంగ్రెస్ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయలేదు కాబట్టి.. అనే ఓ కుంటి సాకుతో, ఇంకా ఆయన్ని కాంగ్రెస్ నేతగా ఎవరైనా భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం వుండదు.
‘రాజకీయాలకు నేను దూరం. నేను ఏ పార్టీలోనూ లేను. నా తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ నడుపుతున్న జనసేన పార్టీలో కూడా చేరలేదు. కాకపోతే, తమ్ముడు కదా.. పవన్ కళ్యాణ్కి అన్నగా నా మోరల్ సపోర్ట్ వుంటుంది..’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పాత పరిచయాల నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారు. చిరంజీవి మద్దతునీ కోరుతున్నారు.
సినిమా నటులు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, ఆయా రాజకీయ నాయకుల తరఫున ఎన్నికల ప్రచారంలో కనిపిస్తుండడం చూస్తున్నాం. వారి మీద వ్యక్తిగత ద్వేషం ఎవరికైనా ఎందుకు వుంటుంది.?
కానీ, చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, బాహాటంగా ఏ రాజకీయ పార్టీకీ మద్దతు పలక్కపోయినా, ఆయన మీద విషం చిమ్మడం మాత్రం ఆగడంలేదు. ప్రధానంగా వైసీపీ అను‘కుల’ మీడియా, అందునా పాత్రికేయాన్ని వెబ్ చారంగా మార్చేసిన వెబ్ మీడియా, చిరంజీవిని కాంగ్రెస్ నేతగా చూపిస్తూ, ‘సంస్కార పాఠాలు’ వల్లిస్తోంది.
చిరంజీవి కాంగ్రెస్ నాయకుడనీ, నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసి బీజేపీ, టీడీపీ అభ్యర్థుల తరఫున రాజకీయంగా వకాల్తా పుచ్చుకుంటున్నారనీ సదరు వెబ్చార మీడియాలో కథనాల్ని వండి వడ్డిస్తున్నారు.
ముందే చెప్పుకున్నట్లు, చిరంజీవి రాజకీయాల్లో లేరు. గతంలో వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల “నిర్ణయానికీ” చిరంజీవి మద్దతిచ్చారు. ఇప్పుడు తనను కలస్తున్న పలువురు అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారు, వారి గెలుపును ఆకాంక్షిస్తున్నారు. పైగా, పవన్ కళ్యాణ్ కేంద్రంగానే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏర్పాటయ్యింది.
ఈ నేపథ్యంలో తమ్ముడి రాజకీయ ఎదుగుదలని ఆకాంక్షిస్తూ, కూటమి అభ్యర్థులు గెలవాలని చిరంజీవి కోరుకోవడం తప్పెలా అవుతుంది.? మొన్నీమధ్యనే తమ్ముడి పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు చిరంజీవి. అది కూడా జనసేన పార్టీ, కౌలు రైతుల కుటుంబాలకు చేస్తున్న సాయానికి చేదోడుగా వాదోడుగా ఆ ఐదు కోట్లు అవసరమవుతాయని చిరంజీవి ఆ విరాళం ఇచ్చారు.
కుల జాడ్యం తప్ప, చిరంజీవికి వ్యతిరేకంగా కథనాలు రాయడానికి ఈ వెబ్చార మీడియాకి వేరే కారణం దొరకదు. వైసీపీ అను‘కుల’ మీడియా కదా.?
రాజకీయాల్ని నేరస్తులు శాసిస్తున్న రోజులివి. అలాంటి నేరగాళ్ళకు మీడియా వంత పాడటం.. కుల జాడ్యంతో అలాంటి నేరగాళ్ళకు మద్దతివ్వడం.. ఇదంతా చూస్తోంటే, మీడియా ఎక్కడుంది.. అంతా మాఫియానే.. అనిపించకమానదు.! వెబ్..చారం.. మాఫియా.. ఇదా పాత్రికేయమంటే.?