అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ఇంకా తమిళ ప్రేక్షకులు శ్రీదేవికి ఒకప్పుడు బ్రహ్మరథం పట్టారు. సౌత్ ను వదిలేసి బాలీవుడ్కు వెళ్లిన తర్వాత కూడా శ్రీదేవిని ఆరాధిస్తూనే వచ్చారు. తదుపరి తరంవారు కూడా శ్రీదేవి సినిమాలు చూస్తూ ఉండటం వల్ల ఆమెపై అభిమానంను పెంచుకున్నారు. ఆమె మృతి తర్వాత ఆమె కూతురు సౌత్ లో నటించాలని.. ఆమె తన తల్లి అభిమానుల కోసం సౌత్లో నటించాల్సిందే అంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.
జాన్వీ కపూర్ ఆమద్య రామ్ చరణ్తో ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వీకపూర్ నటించబోతుందని.. ఇలా పలు రకాల వార్తలు పలువురు హీరోలతో జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్కు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించబోతుంది అంటూ కొత్త వార్తలు పుట్టుకు వచ్చాయి.
ఇప్పటి వరకు వచ్చిన వార్తపై స్పందించిన జాన్వీ కపూర్ మరోసారి స్పందించింది. ఎన్టీఆర్తో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు తాను ఒక్క సౌత్ సినిమాకు కూడా కమిట్ కాలేదు అంటూ ఆమె పేర్కొంది. ఇప్పటి వరకు పది సార్లు జాన్వీ కపూర్ సౌత్లో నటించడం లేదు అంటూ మీడియాలో వచ్చిన వార్తలను కొట్టి పారేయడం.. మళ్లీ సౌత్లో ఆమె నటించబోతుంది అంటూ వార్తలు రావడం కామన్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి చేయడం లేదు కాని భవిష్యత్తులో చేస్తాను అన్నట్లుగానే ఈ అమ్మడు చెబుతోంది. కాని ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
530431 71774I take pleasure inside the comments on this weblog, it actually gives it that community feel! 796723