Switch to English

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – బిలో యావరేజ్ రియలిస్టిక్ డ్రామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

నాంది చిత్రంతో సీరియస్ రియలిస్టిక్ డ్రామాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ మరోసారి అలాంటి జోనర్ కు చెందిన చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రోమోలతో ఇదేదో సీరియస్, హార్డ్ హిట్టింగ్ చిత్రంలా అనిపించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. మారేడుమిల్లి అనే గిరిజన ప్రాంతంలో ఎన్నికలు సజావుగా నిర్వహించే బాధ్యత అతనికి అప్పగిస్తుంది ప్రభుత్వం. తన టీమ్ తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన శ్రీనివాస్ కు అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్న విషయం అర్ధమవుతుంది.

ఆ గిరిజనులు ఎదురుకొనే సమస్యలు ఎలాంటివో తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఈ సమస్యల విషయంలో శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల తనకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇంతకీ ఎన్నికల నిర్వహణ సజావుగా పూర్తయిందా? సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు నరేష్. ఇలాంటి రియలిస్టిక్ డ్రామాలకు తాను పెర్ఫెక్ట్ గా సరిపోతాను అని మరోసారి నిరూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే చిత్రం మొత్తాన్ని తన భుజాలపై మోశాడు నరేష్. ఆనంది తన పాత్ర వరకూ చక్కగా చేసింది. అయితే తన పాత్ర విషయంలో దర్శకుడు ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, తదితరులు తమ తమ పరిధుల మేరకు బాగానే రాణించారు. మిగతా వాళ్లంతా మాములే.

సాంకేతిక వర్గం:

దర్శకుడు ఏఆర్ మోహన్, కథగా మంచి కాన్సెప్ట్ నే తీసుకున్నాడు. తాను అనుకున్న మెసేజ్ ను అయితే చెప్పగలిగాడు కానీ ఆ చెప్పే క్రమంలో సినిమా గతి తప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. స్క్రీన్ ప్లే ఊహాజనితంగానే ఉంది. ఇక దర్శకుడు కథలోకి వెళ్ళడానికి కావాల్సినదానికన్నా ఎక్కువ సమయమే తీసుకోవడం కూడా నెగటివ్ అయింది. కాన్సెప్ట్ గా చూసుకుంటే ఈ చిత్రం అద్భుతం. అయితే చెప్పే విధానంలోనే ఉంది సమస్య అంతా.

శ్రీచరణ్ పాకల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే పాటల విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకోవాల్సింది. రామ్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు.

ప్లస్ పాయింట్స్:

  • నరేష్ పెర్ఫార్మన్స్
  • చిత్రంలో ఇచ్చిన మెసేజ్

నెగటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • పేలవమైన డైరెక్షన్
  • స్లో నరేషన్

చివరిగా:

నరేష్ అద్భుతమైన పెర్ఫార్మన్స్, లాస్ట్ లో ఇచ్చే మెసేజ్ ను పక్కన పెడితే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అందరినీ మెప్పించే అవకాశాలు లేవు. కేవలం కొన్ని వర్గాలకే రుచించే ఈ చిత్రాన్ని ఈజీగా స్కిప్ చేయవచ్చు.

తెలుగు బులెటిన్. కామ్ రేటింగ్: 2.25/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....