ఏపీలోని చిత్తూరు జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమనాశ్రయంపై పెను ప్రమాదం తప్పింది. రన్ వేను పరిశీలించేందుకు వెళ్లిన ఫైరింజన్ వాహనం బోల్తా పడిన ఘటన ఆదివారం జరిగింది. ఈ సమయంలో ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తోంది. రన్ వేపై ఈ ఘటన జరగడంతో విమానం ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో మరికొన్ని విమానాల ల్యాండింగ్ కు కూడా అనుమతి నిరాకరించడంతో తిరుగు పయనమయ్యాయని సమచారం.
ఘటన జరిగిన అనంతరం అధికారులు అప్రమత్తమయ్యారు. బోల్తా పడిన వాహనం తొలగింపు పనులు చేపట్టారు అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా.. మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన రెండున్నర గంటల్లో రన్ వే క్లియర్ చేసినట్టు అధికారులు తెలిపారు.
833771 106813Some truly nice stuff on this website, I really like it. 816125
437228 696943I discovered your weblog post web web site on the search engines and appearance several of your early posts. Always sustain the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading a lot much more on your part down the line! 605875