KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి (Rajamouli)-మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ (SSMB 29) నిర్మిస్తోంది ఆయనే. ఈ సంతోషంలో సినిమా సంగతులు పంచుకున్నారు.
‘15ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్ సెట్ చేశాం. కానీ.. ఇప్పటికి కుదిరింది. పైగా.. నాటి మాటను గుర్తు పెట్టుకుని రాజమౌళి-మహేశ్ నాకు చెప్పకుండానే దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పనిపై వారి నిబద్ధతకు ఇది నిదర్శనం. ఇప్పుడు మహేశ్ రేంజ్ మారిపోయింది. రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ ప్రాజెక్టులు తెరకెక్కించే స్థాయిలో ఉన్నా నాకు సినిమా చేయడం విశేషం’.
‘కథా చర్చల్లో ప్రతి విషయం రాజమౌళి చెప్తున్నారు. నా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కథ అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ ఇంకా నిర్ణయించకపోయినా.. ఆర్ఆర్ఆర్ అంచనాలు దృష్టిలో పెట్టుకుని కథ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా’నని అన్నారు.