కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్ ఛానల్తో ఇంటర్వ్యూ సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘నాకు అత్యంత బాధాకరమైన విషయం ఇది. నా చెల్లెలు కడపలో ఓడిపోతోంది. ఆమెకు డిపాజిట్లు కూడా రావు..’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంత బాధాకరమైతే, వైఎస్ షర్మిలకి వైసీపీ నుంచి టిక్కెట్ ఇచ్చి గెలిపించి వుండొచ్చు కదా.? సొంత చెల్లెలి కంటే, బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డి అంత ముఖ్యమైపోయాడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయ్.
కాగా, కడప లోక్ సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ షర్మిల. షర్మిలకి, కాంగ్రెస్కీ అంత సీన్ లేదని తొలుత అందరూ భావించారు. అందులో నిజం లేకపోలేదు కూడా.! కానీ, వైఎస్ షర్మిల, కడపలో ఇంపాక్ట్ గట్టిగానే చూపిస్తున్నారు.
గెలిచే స్థాయిలో వైఎస్ షర్మిల, కడపలో సత్తా చాటుతారని అనుకోలేంగానీ, వైసీపీ విజయావకాశాల్ని మాత్రం ఆమె గణనీయంగా దెబ్బతీసే అవకాశాలున్నాయి. ప్రధానంగా క్రైస్తవ ఓటు బ్యాంకుని ఆమె చీల్చబోతున్నారు. షర్మిలకి పడే ప్రతి ఓటూ, కరడుగట్టిన వైసీపీ ఓటే అవుతుందన్నది నిర్వివాదాంశం. అవి ఎన్ని ఓట్లు.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
వైసీపీ వర్సెస్ టీడీపీ.. అనుకున్న ఈ కడప లోక్సభ సీటులో, ఇప్పుడు ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. షర్మిల మీద వైఎస్ జగన్ మొసలి కన్నీరు కార్చిన దరిమిలా, డిపాజిట్ తెచ్చుకోవడం షర్మిల ముందున్న లక్ష్యం. ఆ దిశగా ఇప్పటికే ‘బ్రదర్’ అనిల్ కడపలో, తెరవెనుకాల స్కెచ్ అమలు చేసేస్తున్నారు.
మరోపక్క, కూటమికి ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి వైసీపీ వర్సెస్ కూటమి.. గట్టి పోటీ వుందిప్పుడు. ఆ వైసీపీ నుంచి కొన్ని ఓట్లు వైఎస్ షర్మిల లాగేయగలిగితే, కూటమికి క్లియర్ విక్టరీ కడప లోక్ సభ పరిధిలో దక్కొచ్చు.! ఇదే ఈక్వేషన్ నేపథ్యంలో షర్మిల మీద వైఎస్ జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారా.? ఏమో.. ఈ మొసలి కన్నీళ్ళకు షర్మిల కరిగిపోయే పరిస్థితే లేదు.! షర్మిలకి ఓటెయ్యాలనుకునేవారూ మారే అవకాశమే లేదు.!