జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెర్లపల్లి గ్రామంలో దారునం జరిగింది. భార్యపై అనుమానంతో ఏకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. శంకరయ్య సుదీర్ఘ కాలంగా ముంబయిలోని కల్లు దుకాణంలో పని చేస్తున్నాడు. భార్య మరియు పిల్లలు చర్లపల్లిలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండే శంకరయ్యకు ఈమద్య కాలంలో తన భార్యపై అనుమానం కలిగింది. ఆమె ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా భావించి గొడవ పడటం మొదలు పెట్టాడు.
భార్యతో పదే పదే గొడవ పడుతున్న శంకరయ్య రెండు నెలల క్రితం మల్లన్న దేవుడి పట్నాల కోసం వచ్చాడు. అప్పటి నుండి గ్రామంలోనే ఉంటున్న శంకరయ్య ప్రతి రోజు భార్యతో గొడవ పడుతూ ఉండే వాడు. సోమవారం తెల్లవారు జామున సుజాత బాత్ రూంకు వెళ్లిన సమయంలో శంకరయ్య గొడ్డలి పట్టుకుని ఆమె కోసం వేచి చూశాడు. ఎప్పుడైతే బాత్ రూం నుండి బయటకు వచ్చిందో వెంటనే గొడలితో విచక్షణ రహితంగా నరికాడు. రక్తపు మడుగులో సుజాత అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచింది. రాత్రి అంతా కూడా సుజాత శవం వద్ద శంకరయ్య ఉన్నాడు. కొడుకులు తెల్లవారు జామున లేచి చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో శంకరయ్య ను అరెస్ట్ చేశారు.
557533 727678I like this web site very considerably so significantly superb information . 556038
741585 907145Spot up for this write-up, I seriously believe this web site needs a whole lot a lot more consideration. Ill apt to be once much more to learn additional, appreciate your that information. 139082