తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో వుంది.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో వుంది.
కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు.. వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయ్..ట.! ఔనా.? మరి, తెలంగాణలో ఎందుకు పెన్షన్లు, వృద్ధుల ప్రాణాలు తీయడంలేదు.? ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రంలో శవ రాజకీయాలు జరగడంలేదు గనుక.!
వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థ తెరపైకి తీసుకొచ్చింది. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ ముసుగేసి, ప్రతి నెలా ఒక్కో వాలంటీరుకీ ఐదు వేల రూపాయల ప్రజా ధనాన్ని అప్పనంగా దోచిపెడుతోంది వైసీపీ సర్కారు. ఇంటింటికీ సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాలు.. అంటూ కథలు చెబుతూ వచ్చింది వైసీపీ.
ఆ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి వుంటే, ఆ వ్యవస్థకు చట్టబద్ధత వుంటే, ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను విధులకు దూరంగా వుంచి వుండేది కాదు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని ఎన్నికలకు ముందర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాక, వాలంటీర్లు ఎలా సామాజిక పెన్షన్లు పంచడానికి అర్హులవుతారు.?
తప్పు వైసీపీ చేసి, సంక్షేమ పథకాలు లబ్దిదారులకు ఇంటి వద్ద అందడంలేదు గనుక, సామాజిక పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ శవ రాజకీయాలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
తెలంగాణలోనూ ఎండలే.. తెలంగాణలోనూ వృద్ధులే.. తెలంగాణలోనూ పెన్షన్లే.. ఇక్కడ లేని రాజకీయ చావులు, ఏపీలోనే ఎందుకు సంభవిస్తున్నాయ్.? ఇది వైసీపీ మార్కు రాజకీయ హత్యలని ఎందుకు అనుకోకూడదన్నది సామాన్యుడి ప్రశ్న.