గద్వాల జిల్లాకు చెందిన దివ్య అనే యువతిని స్వయంగా ఆమె తల్లిదండ్రులు హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది. గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన దివ్య గత కొన్నాళ్లుగా వేరే కులంకు చెందిన వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తితో దివ్య ప్రేమను ఒప్పుకోని తల్లిదండ్రులు తమ పరువు తీస్తుందని ఆగ్రహంతో కూతురును చంపేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దివ్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు.
కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా ప్రేమించింది అంటూ చంపేయడం దారుణం అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకునేందుకు ఇంకా కూడా కొందరు అనుమతించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తమ పరువు పోవద్దనే ఉద్దేశ్యంతో కన్న పిల్లలను కూడా చంపేందుకు వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని చూడాలో. ఈ సమాజంలో కులం ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంటూ దివ్య సన్నిహితులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
603117 589157hey there, your internet site is inexpensive. We do thank you for function 644337
494349 705476A thoughtful insight and ideas I will use on my weblog. Youve certainly spent lots of time on this. Thank you! 684791