ఇష్టమైన రంగంలో కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు కర్ణాటకకు చెందిన ఎన్.గాయత్రి. 25ఏళ్ల వయసుకే కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కోలారు జిల్లా బంగారపేట తాలుకా యళబుర్గికి చెందిన గాయత్రి 2021లో లా పూర్తి చేశారు.
చదువులో ఎప్పుడూ ముందుండే గాయత్రి న్యాయ విద్యలో తన ప్రతిభతో యూనివర్శిటీ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం విశేషం. సివిల్ జడ్జి నియామకాల కోసం జరిగిన ఇంటర్వ్యూలో తొలిసారి నిరాశ ఎదురైనా పట్టుదలతో రెండోసారి విజయం సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. తల్లిదండ్రులు నారాయణ స్వామి, వెంకట రత్నమ్మలు వ్యవసాయ కూలీలు. వీరికి గాయత్రి ఒక్కరే సంతానం.
న్యాయవాద వృత్తిలోకి వెళ్లేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఆమెను నేడు చిన్నవయసులోనే న్యాయమూర్తి అయ్యేందుకు దోహదపడింది. పేదరికంలో పుట్టినా చదువుపై శ్రద్ధతో ఉన్నత స్థానం అందుకున్న గాయత్రి ఎందరికో ఆదర్శం. కోలార్ జిల్లాలోని కెంగళ్ హనుమంతయ్య కళాశాలలో ఆమె న్యాయవాద విద్య పూర్తి చేశారు.
423140 982045You produced some first rate factors there. I regarded on the internet for the issue and located a lot of people will associate with with your internet site. 515350
156509 500107Maintain websiteing stuff like this I truly am fond of it 69532
55194 19031Thank you for the auspicious writeup. It in truth used to be a amusement account it. Glance complex to a lot more added agreeable from you! Nonetheless, how could we be in contact? 405363