దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన రెండు సంస్థల్లో సీరం ఇనిస్టిట్యూట్ ఒకటి. ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇంత గొప్పగా ఈ వ్యాక్సిన్ గురించి చెప్పుకుంటున్న సమయంలో ఓ వార్త షాక్ కు గురి చేసింది. పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరగడమే ఈ షాక్ కు కారణం.
ప్లాంట్లోని టెర్మినల్-1 గేట్ వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలతో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘట విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే.. కోవీషీల్డ్ టీకా తయారీకి ఎలాంటి ఆటంకం లేదని సీరం ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై ఇనిస్టిట్యూట్ విచారణ చేపట్టింది.
294481 431763Hey man, .This was an exceptional page for such a hard subject to talk about. I look forward to reading several much more wonderful posts like these. Thanks 574126
526790 926564This post contains excellent original thinking. The informational content here proves that points arent so black and white. I feel smarter from just reading this. 340692