కరోనా మహమ్మారి మనుషులను బలి తీసుకోవడమే కాదు.. వారిలో ఉన్న మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. అప్పుడే లోకంలోకి వచ్చిన శిశువు కళ్లు తెరవకముందే మరణించింది. ఊళ్లోకి తీసుకొచ్చేందుకు గ్రామస్థులు ససేమిరా అన్నారు. దీంతో కన్నబిడ్డను అనాధగా నీళ్లు లేని కాలువలో వదిలేసాడో కన్న తండ్రి. కన్నీళ్లు తెప్పించే ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
జిల్లాలోని శిరివెళ్ల మండలం కోటపాడుకు చెందిన మదార్ బీ నెలలు నిండడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. శుక్రవారం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టగానే బిడ్డ మరణించింది. దీంతో బిడ్డను తీసకుని గ్రామానికి వెళ్లాలని తండ్రి షంషావలి గ్రామస్థులతో సంప్రదించాడు. కరోనా భయంతో గ్రామస్థులు మృత శిశువును గ్రామానికి తీసుకొచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో షంషావలీకి ఏం చేయాలో తెలీక గ్రామానికి వెళ్లే దారిలో కేసీ కెనాల్ బిడ్డను పడేసి వెళ్లిపోయాడు. విషాదకరమైన ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. తర్వాత స్థానికులు కొంతమంది బిడ్డను గమనించారు. వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే వారు వచ్చి బిడ్డ చేతికి ఉన్న ట్యాగ్ ద్వారా వివరాలు సేకరించారు. షంషావలికి సమాచారం అందించడంతో వచ్చి బిడ్డను తీసుకెళ్లాడు. ఇటివల కరోనా భయంతో సాటి మనుషులను చూస్తేనే భయపడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగడం విచారకరం.
962570 186569When I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with exactly the same comment. Is there any approach you will be able to remove me from that service? Thanks! 197048
677112 313991Couldn?t be designed any greater. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a excellent read. Thanks for sharing! 89772