కొన్నేళ్లపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు అడవిదొంగ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. వీరప్పన్. ఆయన కుమార్తె విద్యా వీరప్పన్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈక్రమంలో బీజేపీ ఆమెకు తమిళనాడులో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు స్టేట్ యూత్ వింగ్ కు ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ఈమేరకు ఆదివారరం జరిగిన కార్యక్రమంలో పార్టీ ఆమెకు బాధ్యతలు అప్పగించింది.
విద్యా వీరప్పన్ గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరింది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. వచ్చే ఏడాది తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో వీరప్పన్ వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా విద్యకు కీలక బాధ్యతలు అప్పగించారు రాష్ట్ర బీజేపీ నాయకులు. వృత్తిరీత్యా విద్యా న్యాయవాది. మూడు రాష్ట్రాల పోలీసులను, అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ 2004లో తమిళనాడు, కర్ణాటక పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో మృతి చెందాడు.
911032 233926Hi. Cool post. There is really a dilemma with the internet site in firefox, and you might want to test this The browser may be the marketplace leader and a huge portion of folks will miss your outstanding writing due to this issue. 307929
979488 89197Hey, you used to write exceptional, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past few posts are just a little out of track! come on! 209234