పసిబిడ్డలను విక్రయించిన సృష్టి ఆసుపత్రి ముఠా అరాచకాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. పురిట్లో బిడ్డ చనిపోయిందని ఓ కుటుంబాన్ని నమ్మించి అదే బిడ్డను 13 లక్షలకు మరో కుటుంబానికి విక్రయించిన దారుణ ఘటన విశాఖ పోలీసులు గుర్తించారు. గతంలో సృష్టి ఆసుపత్రి సహకారంతో మరో ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లిన ఓ గర్భిణికి పురిట్లోనే బిడ్డ చనిపోయిందని చెప్పారు. ప్రస్తుతం సృష్టి దురాగతాలు వెలుగులోకి రావడంలో ఆమె పోలీసులకు అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణంలో పద్మజ ఆసుపత్రి పాలుపంచుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని చోడవరం మండలానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మి ప్రసవం కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను నూకరత్నం అనే మహిళ పరిచయం చేసుకుంది. విశాఖలోని సృష్టి ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవం చేస్తారని నమ్మించింది. స్థానిక ఆశావర్కర్ సృష్టి ఆసుపత్రి ఏజెంట్ గా పనిచేస్తున్న బంధువు రామకృష్ణతో కలిసి వెంకటలక్ష్మిని నవంబరులో సృష్టి ఆసుపత్రికి తీసుకొచ్చారు. జనవరి నెలాఖరులో ప్రసవం అవుతుందని డాక్టర్ తిరుమల చెప్పారు. జనవరి 29న వెంకటలక్ష్మికి రక్త పరీక్షలు చేసి రిపోర్టును సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రిలో డాక్టర్ పద్మజకు పంపించారు.
సృష్టి ఆసుపత్రి డాక్టర్ తిరుమల, డాక్టర్ సరోజినిల సహకారంతో పద్మజ ఆసుపత్రిలో జనవరి 30న చేర్పించి 31న సిజేరియన్ చేశారు. వెంకటలక్ష్మికి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పురిట్లోనే బిడ్డ చనిపోయిందని వెంకటలక్ష్మి దంపతులకు నమ్మించారు. బిడ్డకు వేరే ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం విజయనగరానికి చెందిన దంపతులకు రూ.13 లక్షలకు బిడ్డను అమ్మేశారు. ప్రస్తుతం పద్మజ, నూకరత్నంలను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు ఇప్పటికే జైలులో ఉన్నారు.
889397 967380View the following ideas less than and discover to know how to observe this situation whilst you project your home business today. Earn dollars from home 323388