Atlee: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. గతేడాది సెప్టెంబర్ 7న విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పుడు జీ సినీ అవార్డ్స్ కూడా దక్కించుకుంది.
ఈక్రమంలో ఉత్తమ దర్శకుడిగా అట్లీ నిలిచారు. ఆయన పేరు ప్రకటించగానే షారుఖ్ కు అట్లీ పాదాభివందనం చేసి స్టేజి మీదకు వెళ్లి అవార్డు స్వీకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు షారుఖ్ కూడా ఇదే సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
షారుఖ్ మాట్లాడుతూ.. ‘అట్లీ జవాన్ కోసం నాలుగేళ్లు కష్టపడ్డాడు. చెన్నై వదిలి ముంబైలో ఉన్నాడు. ఇంత మంచి ప్రాజెక్టుకు నన్ను ఎన్నుకున్నందుకు అట్లీకి కృతజ్ఞతలు. ఆయన టీమ్ కూడా ఎంతో కష్టపడింద’ని అన్నారు. షారుఖ్, అజిత్, అల్లు అర్జున్ తో సినిమాలు చయనున్నారు అట్లీ.
View this post on Instagram