బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను అసని దిశ మార్చుకుంది. తీరం వైపు దూసుకొస్తున్న తుపాను మొదట ఉత్తర కోస్తా-ఒడిశా మధ్య తీరం దాటుతుందని భావించినా.. ప్రస్తుత గమనంతో మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే.. మచిలీపట్నం వద్ద తీరందాటి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మే నెలలో ఏర్పడే తుపానుల తీరు ఇలానే ఉంటుందనే అంచనా వేస్తోంది.తుపాను ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
తెలంగాణలోనూ తుపాను ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
767563 91604What a lovely weblog. I will undoubtedly be back again. Please maintain writing! 200904
103914 941578 There is noticeably a bundle to know about this. I assume you created certain good points in attributes also. 46281
445436 76429Simply wanna input that you have a quite nice internet site , I enjoy the pattern it truly stands out. 640852