Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) భారత సైనిక సామర్ధ్యాల గురించి చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగిన సైనిక విన్యాసాలపై ఆయన ట్వీట్ చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు. దానికో క్యాప్షన్ కూడా జోడించారు.
‘ఇతర దేశాల సైన్యానికి వ్యక్తిగతంగా నాదో సలహా. వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు’ అని భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రాసుకొచ్చారు. ఇందుకు జాతీయ జెండా, విజయాన్ని సూచిస్తూ ఉన్న ఎమోజీలను జోడించారు. భారత సైన్యం చేసిన కవాతుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు.
ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ లో భారత సైనిక శక్తిని చాటేలా ప్రదర్శనలు నిర్వహించారు. దేశీయంగా తయారైన క్షిపణులు, నిఘా వ్యవస్థలు, జామర్లు, నాగ్ మిసైల్స్, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, అథునాతన రాడార్ వ్యవస్థ, బీయంపీ-2 శకటాలు, మల్టీపుల్ రాకెట్ వ్యవస్థలకు సంబంధించిన విన్యాసాలతో అబ్బురపరిచారు.
Some personal advice to other armies:
Don’t ever.. EVER… mess with these guys…
💪🏽🇮🇳
— anand mahindra (@anandmahindra) January 27, 2024