Prasanth Varma: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమాపై కామెంట్స్ చేశాడు.
‘ఆదిపురుష్ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చాయి. అదే క్రమంలో కొన్ని సన్నివేశాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అవి నాకేమాత్రం నచ్చలేదు. నేను తీసుంటే ఇంకా బాగా తెరకెక్కించేవాడ్ని కదా అనిపించింది. వేరే సినిమా చూసినప్పుడు ప్రతి దర్శకుడికీ ఇదే అనిపించడం సహజం. అయితే పురాణాలపై నాకున్న మక్కువతో అలా అనిపించింద’ని అన్నాడు.
నిజానికి హనుమాన్ విడుదలయ్యాక సినిమాలో విఎఫ్ఎక్స్ ఉపయోగించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆదిపురుష్ లో వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం హను-మాన్ తో పోల్చడంతో తీవ్ర ట్రోలింగ్ కు గురైంది.