Anand Mahindra: ప్రస్తుత మానవ జీవితాన్ని సెల్ ఫోన్ లేకుండా ఊహించడం చాలా కష్టం. ఎన్నో పనులు ఎక్కడి నుంచైనా అరచేతిలోని మొబైల్ చేసేస్తోంది. బ్యాంక్ ఆపరేషన్స్, ట్రావెల్, మూవీ టికెట్స్.. ఏదైనా మొబైల్ నుంచే. ఇదే మొబైల్ చిన్నారులకూ చేరువైపోయింది. అన్నం తినాలన్నా.. ఏడుపు ఆపాలన్నా చేతిలో మొబైల్ పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడో చిన్నారి తన ముందు పళ్లెంలో ఉన్న తినుబండారాన్ని సెల్ ఫోన్ అనుకుని చెవి దగ్గర పెట్టుకున్న వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మానిషి జీవితం చాలా మారిపోయింది. చిన్నా, పెద్దా ఎవరికైనా ఫోన్ కావాలి. వీడియోలో ఉన్న చిన్నారికి కూడా. ఆ తర్వాతే రోటీ, దుస్తులు, ఇల్లు’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయింది. దీనికి నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 60శాతం మంది 5ఏళ్లలోపు చిన్నారులు ఫోన్ బారిన పడుతున్నారని.. ఇది శ్రేయస్కరం కాదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
Oh no, no, no….
It’s true. Our species has irreversibly mutated..
It’s now PHONE, and only AFTER that Roti, Kapda aur Makaan…! pic.twitter.com/49PmgGOYDV
— anand mahindra (@anandmahindra) January 20, 2024