విధి నిర్వహణలో పోలీసుల నిబద్ధత లాక్ డౌన్ సమయంలో మరోసారి చూశాం. కానీ కొంతమంది పోలీసులు ఆ గౌరవాన్ని కాపాడుకోవటం లేదు. ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యం చేయబోయాడు ఎస్సై. విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో ఎస్సైపై విచారణకు ఆదేశించారు.
గుంటూరు జిల్లాలోని పెదకూరపాడుకు చెందిన ఓ జంట సోమవారం అమరావతిలోని ఓ లాడ్జిలో దిగారు. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఎస్సై రామాంజనేయులు డ్రైవర్ సాయికృష్ణతో కలసి లాడ్జికి వెళ్లాడు. అక్కడ జంటను చూసిన ఎస్సై.. ఇద్దరిపై వ్యభిచారం కేసు నమోదు చేస్తనని బెదిరించాడు. బెంబేలెత్తిపోయిన ఆ జంట బతిమాలుకున్నారు. రూ.10వేలు లంచం ఇస్తే కేసు లేకుండా చేస్తానన్నాడు ఎస్సై.
తమ వద్ద 5వేలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. చేతిలో 3వేలే ఉన్నాయని మిగిలిన 2వేల ఏటీఎం నుంచి తెచ్చిస్తానన్నాడు. దీంతో ఎస్సై తన డ్రైవర్ సాయికృష్ణతో కలిసి ప్రియుడిని ఏటీఎంకు పంపాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉండిపోయిన యువతిపై ఎస్సై అసభ్యంగా ప్రవర్తించి కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ప్రతిఘటిస్తున్న సమయంలో ప్రియుడు వచ్చాడు. విషయం బయటకు చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్లిపోయాడు ఎస్సై.
ఈ విషయమై ఆ జంట మంగళవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్ఐ రామాంజనేయులుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.
167807 865264Your post is truly informative. A lot more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even far more of these types of fantastic writing. 709877
654585 290354I got what you intend, saved to favorites , very decent internet website . 552472
461569 786294Thanks for the information. And a response from you. car dealers hips san jose 821934
921894 460223Yours is actually a prime example of informative writing. I believe my students could learn a whole lot from your writing style and your content. I might share this write-up with them. 567147