Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas)హీరోగా నటించిన ‘ఆది పురుష్( Adipurush)’ టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీ గా మారింది. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా భారీగా ట్రోల్స్ కి గురవుతోంది. ఇందులో కొన్ని సీన్స్, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు కోర్టుమెట్లు కూడా ఎక్కారు. అయితే ఈ నెగెటివిటీ అంతా కలెక్షన్లపై ఏమాత్రం పడటం లేదు. బాలీవుడ్ లో గాని, టాలీవుడ్ లో గాని ఎక్కడ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లేకపోవడంతో ఈ సినిమాకు కాసుల పంట పండుతోంది. టాలీవుడ్ లో అయితే మరో నెలకు పైగా ఈ సినిమా హవా నే కొనసాగనుంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ కి కీలకంగా చెప్పుకునే సమ్మర్ ఈసారి వెలవెల పోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా స్టోరీ టెల్లింగ్, మేకింగ్ విషయాలు పక్కన పెడితే వసూళ్లపరంగా ‘ఆది పురుష్’ దుమ్ము లేపుతోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసి రూ. 500 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకెళ్తోంది. వచ్చేనెల 28 వరకు మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడం ఈ సినిమాకి అచ్చోచ్చే అంశం. అంటే దాదాపు 40 రోజుల వరకు ఈ చిత్ర కలెక్షన్లకు ఏమాత్రం డోకా ఉండదు. దీంతో ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan), సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej)కలిసి నటించిన ‘బ్రో ది అవతార్’ విడుదల కానుంది. ఈలోపు ఒకట్రెండు చిన్న సినిమాలు విడుదలైనా ‘ఆది పురుష్’ కలెక్షన్లపై అది ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు.
ఇక సినిమా విషయానికొస్తే ఇందులో రాఘవుడిగా ప్రభాస్ ( Prabhas), జానకి గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్( Krithi Sanon), శేషు గా సన్నీ సింగ్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan) నటించారు. ఓం రౌత్ దర్శకుడు.