ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయా.? లేదా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు చోట్లా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బావుంటుందని.. ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ భావిస్తున్నాయట.. కలిసి ఓ నిర్ణయానికి వచ్చాయనీ ప్రచారం జరుగుతోంది.
అలా చేస్తే, సార్వత్రిక ఎన్నికలకొచ్చేసరికి.. పరస్పరం సహకరించుకోవడం వీలవుతుందనేది కేసీయార్ ప్రతిపాదన అట. తెలంగాణలో షర్మిల పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకరించేలా, ఆంధ్రప్రదేశ్లో ఒకట్రెండు చోట్ల బీఆర్ఎస్కి వైసీపీ అవకాశమిచ్చేలా.. చర్చలు జరుగుతున్నాయట.
ఇదిలా వుంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైఎస్ షర్మిల దూరంగా వుంటారా.? ఒకవేళ పోటీ చేసినా, పరోక్షంగా బీఆర్ఎస్కి సహకరిస్తారా.? అన్నదానిపై ముందు ముందు స్పష్టత రానుందిట. తొలుత అసెంబ్లీకి వెళ్ళాలని షర్మిల అనుకున్నా, ఇప్పుడామె ఆలోచన లోక్ సభ వైపుగా సాగుతోందిట.
అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ వెనుకబడింది. రేసులోకి కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ‘మాకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థి’ అని గులాబీ పార్టీ కూడా చెబుతోంది. బీజేపీ నుంచి నేతలొకరొకరుగా జారుకుంటున్నారు కూడా ఇతర పార్టీల్లోకి.
ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ మరింతగా మారిపోనున్నాయ్. గులాబీ పార్టీకీ, హస్తం పార్టీకీ.. సీట్లు దాదాపు సమానంగా రాబోతున్నాయన్నది తాజా సర్వేల అంచనాల సారాంశం. బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందట. ఏమో, ఈ ఈక్వేషన్స్లో నిజమెంతో.. ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎలా మారతాయో.!