తమిళనాడు మదురైలోని మణినగర్కు చెందిన మురగేశన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. చిన్న పాప పూర్ణ ఒక రోజు క్లాస్ లో బోర్డుపై అక్షరాలు కనపడటం లేదని మురగేశన్కు చెప్పింది. ఆ సమయంలో ఆయన లైట్గా తీసుకున్నాడు. హైస్కూల్కు వచ్చేప్పటికి కంటి చూపు పూర్తిగా కోల్పోయింది పూర్ణ. అయినా కూడా పట్టుదలతో పూర్ణ బ్రెయిలీ నేర్చుకుని స్కూలింగ్ కొనసాగించింది. ఆ సమయంలో పూర్ణ తల్లి కూడా బ్రెయిలీ నేర్చుకుని కూతురుకు బాసటగా నిలిచింది.
కష్టపడి చదివిన పూర్ణ 10వ తరగతిలో ఫస్ట్ వచ్చింది, ఇంటర్ లో టాపర్గా నిలిచింది. ఆ తర్వాత కూడా తల్లి, స్నేహితుల సహకారంతో ఉన్నత చదువులు పూర్తి చేసింది. 2016 నుండి సివిల్స్ కోసం ఆమె ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరకు ఈ ఏడాది మొన్న వచ్చిన ఫలితాల్లో 286వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్బంగా పూర్ణ మాట్లాడుతూ ఈ విజయంలో అమ్మ పాత్ర కీలకంగా ఉంది. ఆమె నాకు తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి పాఠాలు వినిపించేది. ఆమె పట్టుదలతోనే నేను ఈ స్థాయికి వచ్చానంటూ పూర్ణ మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చింది.
859700 610462This post gives the light in which we can observe the reality. This really is really good 1 and gives in-depth information. Thanks for this nice article. 879104
41835 900474That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be certain to keep writing. 526610