Switch to English

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి వచ్చే కరోనా వైరస్ కంటే భారత్ నుంచి వస్తున్న వైరస్ ప్రాణాంతకమని నేపాల్ ప్రధాని కేపీ ఓలి ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే భారత్ కు చెందిన భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసిన నేపాల్.. తాజాగా చైనా దన్నుతో భారత్ పై అక్కసు ప్రదర్శిస్తోంది.

తాజాగా ఓలి పార్లమెంటులో మాట్లాడుతూ.. తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం భారతేనని ఆరోపించారు. ‘‘నేపాల్ లోకి అక్రమ మార్గాల ద్వారా ప్రవేశిస్తున్న భారతీయుల వల్లే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. పైగా అది చైనా, ఇటలీ వైరస్ కంటే ప్రాణాంతకమైంది’’ అని పేర్కొన్నారు.

నేపాల్ తాజా చర్యలు, వ్యాఖ్యల వెనుక చైనా మద్దతు పరోక్షంగా ఉందని చెబుతున్నారు. గతేడాది అక్టోబర్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నేపాల్ లో పర్యటించిన తర్వాత నేపాల్ వైఖరిలో మార్పు మొదలైంది. అది కాలాపాని రూపంలో బట్టబయలైంది. భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ వాదించడం ప్రారంభించింది.

అనంతరం మానససరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ లోని లిపు లేక్ ప్రాంతం వరకు నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. 1816 నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతం తమదేననే కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా పార్లమెంటులో మాట్లాడిన ఓలి.. లిపులేక్, కాలాపాని ప్రాంతాలను తిరిగి సాధిస్తామనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం వెనుక డ్రాగన్ కంట్రీ ప్రోత్సాహం ఉందని తెలుస్తోంది.

నిజానికి ఈ వ్యవహారం మొత్తం చైనా కనుసన్నల్లోనే సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలు డ్రాగన్ కంట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నాయి. వాటిలో చాలా కంపెనీలు భారత్ వైపు వచ్చే అవకాశం ఉండటంతో చైనా అందుకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. సరిహద్దు వివాదాలు రెచ్చగొట్టడం ద్వారా భారత్ లోకి పెట్టుబడులు రాకుండా నిలువరించాలన్నదే చైనా వ్యూహంగా పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటు నేపాల్ తోపాటు అటు పాక్, చైనా సరిహద్దుల్లో కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. ఇటీవల చైనా, భారత్ సైనికులు పరస్పరం బాహాబాహీకి తలపడటం, చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంలో భారత సుఖోయ్ లు రంగంలోకి దిగడం వంటి పరిణామాలన్నీ మనదేశంలోకి పెట్టుబడులు రాకుండా చేయడంలో భాగమేనని అర్థమవుతోంది. చైనా బుట్టలో పడిన నేపాల్.. కావాలనే భారత్ పై అక్కసు ప్రదర్శిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...