కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి వచ్చే కరోనా వైరస్ కంటే భారత్ నుంచి వస్తున్న వైరస్ ప్రాణాంతకమని నేపాల్ ప్రధాని కేపీ ఓలి ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే భారత్ కు చెందిన భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసిన నేపాల్.. తాజాగా చైనా దన్నుతో భారత్ పై అక్కసు ప్రదర్శిస్తోంది.
తాజాగా ఓలి పార్లమెంటులో మాట్లాడుతూ.. తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం భారతేనని ఆరోపించారు. ‘‘నేపాల్ లోకి అక్రమ మార్గాల ద్వారా ప్రవేశిస్తున్న భారతీయుల వల్లే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. పైగా అది చైనా, ఇటలీ వైరస్ కంటే ప్రాణాంతకమైంది’’ అని పేర్కొన్నారు.
నేపాల్ తాజా చర్యలు, వ్యాఖ్యల వెనుక చైనా మద్దతు పరోక్షంగా ఉందని చెబుతున్నారు. గతేడాది అక్టోబర్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నేపాల్ లో పర్యటించిన తర్వాత నేపాల్ వైఖరిలో మార్పు మొదలైంది. అది కాలాపాని రూపంలో బట్టబయలైంది. భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ వాదించడం ప్రారంభించింది.
అనంతరం మానససరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ లోని లిపు లేక్ ప్రాంతం వరకు నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. 1816 నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతం తమదేననే కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా పార్లమెంటులో మాట్లాడిన ఓలి.. లిపులేక్, కాలాపాని ప్రాంతాలను తిరిగి సాధిస్తామనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం వెనుక డ్రాగన్ కంట్రీ ప్రోత్సాహం ఉందని తెలుస్తోంది.
నిజానికి ఈ వ్యవహారం మొత్తం చైనా కనుసన్నల్లోనే సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలు డ్రాగన్ కంట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నాయి. వాటిలో చాలా కంపెనీలు భారత్ వైపు వచ్చే అవకాశం ఉండటంతో చైనా అందుకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. సరిహద్దు వివాదాలు రెచ్చగొట్టడం ద్వారా భారత్ లోకి పెట్టుబడులు రాకుండా నిలువరించాలన్నదే చైనా వ్యూహంగా పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటు నేపాల్ తోపాటు అటు పాక్, చైనా సరిహద్దుల్లో కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. ఇటీవల చైనా, భారత్ సైనికులు పరస్పరం బాహాబాహీకి తలపడటం, చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంలో భారత సుఖోయ్ లు రంగంలోకి దిగడం వంటి పరిణామాలన్నీ మనదేశంలోకి పెట్టుబడులు రాకుండా చేయడంలో భాగమేనని అర్థమవుతోంది. చైనా బుట్టలో పడిన నేపాల్.. కావాలనే భారత్ పై అక్కసు ప్రదర్శిస్తోంది.
53773 637217I likewise believe thus, perfectly pent post! . 562242
620946 76610Excellent post, well put together. Thanks. I will likely be back soon to check out for updates. Cheers 648240