చివరిగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ కరోనా పరిస్థితులకి మనం భయపడకుండా, సరికొత్తగా అలోచించి కరోనాని మన పురోగతికి వాడుకోవాలని అన్నారు. చూస్తుంటే ఢిల్లీ లోని నలుగురు యువకులు ఈ మాటలని పర్ఫెక్ట్ గా ఆచరణలో పెట్టినట్టు తెలుస్తుంది. కరోనా క్రైసిస్ లో అందరికీ అవసరమైన శానిటైజేషన్ ని తమ బిజినెస్ గా ఎంచుకున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. రాహుల్, భరత్, రాహుల్ మరియు ముఖేష్ అనే నలుగురు కుర్రాళ్ళు ఒక సంవత్సరం క్రితం కలిసి కార్స్, సోఫాస్, కిచెన్ అండ్ టాయిలెట్ కులీనింగ్ చేసే సర్వీస్ ని మొదలు పెట్టారు. వీరి సర్వీస్ కి ఆన్ లైన్ ద్వారా రిజిష్టర్ చేసుకునే ప్రాసెస్ ని కూడా ఏర్పాటు చేశారు. కానీ కరోనా కారణంగా వీరికి గత 2నెలలుగా పూర్తిగా పని లేకుండా పోయింది.
లాక్ డౌన్ 4 లో సడలింపులు ఎక్కువగానే ఉండడం వలన బస్సులు, వాహనాలు రోడ్డెక్కాయి. ఈ టైంలో వెహికల్స్ అన్నిటికీ శానిటైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ. అందుకే ఈ నలుగురు వీరి శానిటైజేషన్ ని కొత్త బిజినెస్ గా ఎంచుకోవడమే కాకుండా ప్రారంభించేసారు కూడాను.. ఈ రోజు ఢిల్లీలో వారు రోడ్స్ మీద పీపీఈ కిట్స్ ధరించి, శానిటైజేషన్ మెషిన్ని ముందుచి కార్ అవుట్ సైడ్ శానిటైజేషన్ కి 50 రూపాయలు, అదే టూ వీలర్ కి అయితే 20 రూపాయలు అనే బోర్డు పెట్టి రోడ్ లో నిల్చున్నారు.
పలువురు ఇవాళ ఎంక్వైరీస్ చేశారు, కానీ చేయించుకున్న వాళ్ళు తక్కువ, రోజు రోజుకీ వారి సంఖ్య పెరుగుతుందని ఆ నలుగురు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చెప్పాలంటే రైట్ టైంలో రైట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వెహికల్స్ లో తిరిగే ప్రతి ఒక్కరికీ ఇప్పుడిది చాలా అంటే చాలా అవసరం. సో ఈ బిజినెస్ త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో మొదలవుతుందని ఆశించవచ్చు.
490818 364909Just wanna comment that you have a extremely nice internet web site , I enjoy the style it actually stands out. 866346