ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని, ఆ దేశంలోన ల్యాబ్ లోనే ఇది ఉద్భవించిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నా చైనా మాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు.. అమెరికాయే ఈ వైరస్ ను తమ దేశంలో వ్యాప్తి చేసిందని ఎదురుదాడి కూడా చేసింది.
అయితే, ఈ వ్యవహారంలో ఆది నుంచి డ్రాగన్ దేశం వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం.. వైరస్ తీవ్రత విషయంలో ఇతర దేశాలను అప్రమత్తం చేయకపోవడం.. చైనా చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వత్తాసు పాడటం వంటి పరిణామాలు అగ్రరాజ్యం అమెరికా సహా పలు పెద్ద దేశాలకు అనుమానాలు కలిగించాయి. ముఖ్యంగా ఈ వైరస్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోవడంతో అమెరికా అధ్యక్షుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ వైరస్ పుట్టుక విషయంలో దర్యాప్తు జరగాల్సిందేనని, చైనా ఇందుకు అంగీకరించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ దీనిని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తోసిపుచ్చారు.
అయితే, తాజాగా ఈ వ్యవహారంలో ప్రపంచ దేశాలన్నీ ఏకం కావడంతో చైనా మెత్తబడక తప్పని పరిస్థితి నెలకొంది. సోమ, మంగళవారాల్లో డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన వర్చువల్ సదస్సులో.. వైరస్ పుట్టక విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని భారత్ సహా 120 దేశాలు ఓ తీర్మానాన్ని ఆమోదించాయి. దీనికి చైనా కూడా తల ఊపక తప్పలేదు.
అయితే, ప్రస్తుతం కరోనాపై పోరాడటమే అందరి లక్ష్యం కావాలని, ఈ వైరస్ మహమ్మారిని అదుపు చేసిన తర్వాత ఈ దర్యాప్తు చేస్తే బాగుంటుందని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తప్పు తమది కాదన్నట్టు వాదించిన చైనా.. చివరకు ప్రపంచ దేశాలన్నీ ఒకటిగా అయ్యేసరికి కిందకు దిగి వచ్చింది. అంతేకాకుండా కరోనాపై పోరుకు తాము రెండేళ్లలో రూ.15వేల కోట్లు ఇస్తామని ప్రకటించింది.
996499 768840Right after study a number of the websites on your own internet website now, i truly like your means of blogging. I bookmarked it to my bookmark website list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 923743
62630 356455Its rare knowledgeable folks within this topic, nevertheless, you appear like theres more youre talking about! Thanks 627187