Switch to English

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్‌ట్యాగ్‌ ‘సపోర్ట్‌ రంగనాయకి మేడమ్’. ఎవరీమె.? ఎందుకు ఈమె పేరు ఇప్పుడు ఇంతలా పాపులర్‌ అవుతోంది.? అంటే, ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఈమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అదే, ఆమె చేసిన నేరం. సీఐడీ బృందం ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఓ ఘటనపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే అరెస్ట్‌ చేసేస్తారా.? అని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది.

ఆమె పెట్టిన పోస్ట్‌లో పలు ఆసక్తికరమైన ప్రశ్నలున్నాయి. నిజానికి అవేవీ తన ఆలోచనలు కావనీ, మల్లాడి రఘునాథ్‌ అనే వ్యక్తి కోట్‌ చేసిన విషయాల్నే తాను ప్రస్తావించానని, అంతే తప్ప ఇందులో తనకు ఎవరి మీదా ద్వేషం లేదని చెబుతున్నారు 66 ఏళ్ళ రంగనాయకి.

‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తల్లి వయసుంటుందామెకి.. అలాంటి రంగనాయకి మేడమ్ మీద దాష్టీకమా.?’ అంటూ టీడీపీ నుంచి వేలాది సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ నుంచి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద. నిజానికి, రంగనాయకి ప్రస్తావించిన చాలా విషయాలు అటు నేషనల్‌ మీడియాలోనూ, ఇటు తెలుగు మీడియాలోనూ కన్పిస్తున్నవే. వాటిని క్రోడీకరించి ఎవరో ఓ పోస్ట్‌ తయారు చేశారు. వాటిని ఆమె పోస్ట్‌ చేశారు. ఓ దుర్ఘటన జరిగినప్పుడు, ఆ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తే అది నేరమవుతుందా.? ఇదెక్కడి న్యాయం.! అని ప్రపంచమంతా విస్తుపోతోంది.

ఇదొక్కటే కాదు, ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రభుత్వ పెద్దల్లో అసహనం పెరిగిపోతోంది. తాను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు, ‘ప్రభుత్వంపై కడుపు మండితే సామాన్యులు సోషల్‌ మీడియాలో తమ ఆవేదనను చెప్పుకుంటారు.. అలా ప్రశ్నించినవారందర్నీ అరెస్ట్‌ చేసుకుంటూ పోతారా.?’ అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దురదృష్టం.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే ‘అణచివేత’ కన్పిస్తోందన్నది నెటిజన్ల మాట.

రంగనాయకి పోస్ట్‌ని వేలాదిమంది టీడీపీ కార్యకర్తలే కాదు, ఇతరులూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇంకా ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అందరికీ నోటీసులు ఇవ్వాలంటే.. అందుబాటులో వున్న పేపర్లు సరిపోతాయా.? అరెస్టులు చేసుకుంటూ పోతే వున్న జైళ్ళు సరిపోతాయా.? అన్నది సోషల్‌ మీడియాలోనే కన్పిస్తోన్న మరికొన్ని పోస్టుల సారాంశం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఇలా ప్రశ్నించేవారిపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సబబో జగన్ ప్రభుత్వం పునరాలోచించుకుంటే మంచిది.

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...