Crime: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆ మహిళనే దారుణంగా హతమార్చాడు. శంషాబాద్ పరిధిలో జరిగిందీ దారుణ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్ నగర్ (Saroor Nagar) ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడికి అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ బంధువులే. అయితే.. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తడి తీసుకురావడంతో సాయికృష్ణతో ఆమెకు గొడవలు జరుగుతూండేవి. ఈక్రమంలోనే వీరిద్దరూ రెండు రోజుల క్రితం కారులో శంషాబాద్ (SamshaBad) పరిధిలోని సుల్తాన్ పల్లికి వెళ్లారు.
అక్కడ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన సాయికృష్ణ ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం కారులోనే ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చి సరూర్ నగర్ ప్రాంతంలోని డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్ హోల్ లో పడేశాడు. అప్సర కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా సాయికృష్ణే హత్య చేశాడని నిర్ధారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.