టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం పాదయాత్ర’ అంచనాలకు మించి అత్యద్భుతంగా సాగుతోందని తెలుగుదేశం పార్టీ చెప్పడంలో వింతేముంది.? వైసీపీ అయితే, యువగళం పాదయాత్రలో జనం కనిపించడంలేదని అంటోంది. వేలాదిగా కాదు, లక్షలాదిగా జనం వచ్చేస్తున్నారంటూ వైసీపీకి కౌంటర్ ఎటాక్ ఇస్తోంది టీడీపీ.
ఇంతకీ, ఏది నిజం.? ఈ రోజుల్లో రాజకీయ పార్టీల కార్యక్రమాలకి జనం పెద్దయెత్తున రావడం.. అదీ స్వచ్ఛందంగా అంటే, అది జరిగే పని కాదు. ఖచ్చితంగా జనాన్ని రప్పించాల్సిందే.. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సింది. ఆ విషయంలో వైసీపీకి వున్నంత అనుభవం ఇంకెవరికీ వుండదేమో.
జనసేన పార్టీకి ఆ సమస్య లేదు. పవన్ కళ్యాణ్ మీదున్న సినీ అభిమానం నేపథ్యంలో, జనసైనికులు స్వచ్ఛందంగా తరలి వస్తారు. దానికి తోడు, సాధారణ ప్రజానీకం కూడా జనసేన పార్టీ పట్ల ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ఈ మధ్యకాలంలో.
ఇక, జనసేన సంగతి పక్క పెడితే, నారా లోకేష్ పాదయాత్రకి వైసీపీ ప్రధాన ప్రచారకర్తగా మారిపోయింది. వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా.. నారా లోకేష్ మీద విమర్శలతో, విపరీతమైన పబ్లిసిటీ నారా లోకేష్కి ఉచితంగా అందిస్తున్నాయ్.
పబ్లిసిటీ ఎలా వస్తోంది.? అన్న విషయమై ఓ అవగాహనకి వచ్చిన వైఎస్ జగన్, అందుకు తగ్గట్టుగా తన మాట తీరుని మార్చుకుంటున్నారు. వైసీపీ నేతల భాషనీ ప్రయోగిస్తున్నారు. దాంతో, టార్గెట్ చేయబడ్డ వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు.
మొత్తమ్మీద, ఈ ఎపిసోడ్లో నారా లోకేష్ వ్యూహం రాజకీయంగా ఫలించినట్లే కనిపిస్తోంది.