కరోనా కారణంగా ఇప్పటికే పలువురి ఉపాధి ప్రశ్నార్థకం కాగా, తాజాగా కువైట్ వెళ్లిన భారతీయులకు మరో చిక్కు వచ్చి పడింది. ఆ దేశం తీసుకొస్తున్న ఓ చట్టం దాదాపు 8 లక్షల మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వారంతా ఇంటి బాట పట్టేలా చేయనుంది. తమ జనాభా కంటే అత్యధికంగా ఉన్న విదేశీయులను వెనక్కి పంపించే ఉద్దేశంతో రూపొందించిన ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు కువైట్ నేషనల్ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. దానిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత యంత్రాంగానికి పంపింది. దీని ప్రకారం ఇకపై ప్రవాసీలను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు.
ప్రస్తుతం కువైట్ లో మొత్తం జనాభా దాదాపు 43 లక్షలు కాగా.. ప్రవాసీలు 30 లక్షల మంది ఉంటారు. వీరిలో దాదాపు 14.5 లక్షల మంది భారతీయులే. మనోళ్ల తర్వాత ఈజిప్షియన్లు ఉంటారు. అయితే, కరోనా కల్లోలం సృష్టిస్తున్నతరుణంలో విదేశీయులను వెనక్కి పంపించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ప్రవాసీలను వెనక్కి పంపే బిల్లుకు కువైట్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం కువైట్ లో నివసించే భారతీయులు తమ దేశ జనాభాలో 15 శాతానికి మించి ఉండకూడదు. నేషనల్ అసెంబ్లీ కమిటీ ఆమోదించిన ఆ బిల్లుకు చట్టబద్ధత వస్తే దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనక్కి రావాల్సి ఉంటుంది. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని కువైట్ లోని భారత ఎంబసీ పేర్కొంది.
845428 127195Rattling clean internet site , appreciate it for this post. 4461
99234 840292A truly exciting examine, I might possibly not concur entirely, but you do make some genuinely legitimate points. 194151