దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ వందనం చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రాజ్ పథ్ లో గణతంత్ర పేరేడ్ ప్రారంభమైంది. భారతదేశ సైనిక సామర్ధ్యాన్ని చాటి చెప్పేలా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఘనంగా పేరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈసారి కావాతులో భాగంగా ఎయిర్ ఫోర్స్ కు చెందిన 75 విమానాల విన్యాసాలు, ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు, రక్షణ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది పేరేడ్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 10:30 గంటలకు ప్రారంభమైంది.
362066 746449Whoa! This weblog looks just like my old 1! It is on a completely different topic but it has pretty much exactly the same layout and style. Outstanding choice of colors! 534858
843961 326254Some genuinely fascinating data, effectively written and generally user genial . 827396
655685 857264Magnificent website. Plenty of useful information here. 81950