15 రోజుల క్రితం ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో సృష్టించిన జలవిలయం గురించి తెలిసిందే. ఈ విలయం ధాటికి మొత్తంగా 204 మంది గల్లంతయ్యారు. వీరిలో 68 మృతదేహాలన ఇప్పటి వరకూ లభ్యమయ్యాయి. ఇంకా మిగిలిన 136 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో వీరంతా మృతి చెంది ఉంటారనే భావిస్తున్నారు. ఈమేరకు అధికారులు, రెస్క్కూ సిబ్బంది భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమయాత్తమవుతోంది.
ఫిబ్రవరి 7న ధౌలిగంగాలో మంచుచరియలు విరిగిపడటంతో నది ఉప్పొంగి జల ప్రళయం ఏర్పడింది. ఈ ఉత్పాతానికి ఓ జల విద్యుత్ కేంద్రంతోపాటు ఐదు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. ఒక్క తపోవన్ సొరంగంలోనే 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇదే సొరంగంలో చక్కుకున్న కొంతమందిని రెస్క్యూ సిబ్బంది అప్పట్లోనే రక్షించారు. 2013లో ఉత్తరాఖండ్ లోనే జల విలయం సంభవించిన సంగతి తెలిసిందే.
508079 493049I got what you mean , saved to bookmarks , really decent site. 999753