ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్ధులు ఎక్కువగానే ఓటమిపాలయ్యారు. టీడీపీ కంచుకోటలుగా భావించే ఎన్నో చోట్ల అధికార వైసీపీ గెలుచుకోవడమే వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో 89 పంచాయతీలకు 74 పంచాయతీలు వైసీపీ గెలుచుకోవడం అధినేతను కలవరానికి గురి చేస్తోంది. ఇవే ఎన్నికల ఫలితాలు పార్టీలో ఉన్న విబేధాలను బయటకు వచ్చేలా చేసింది. రామకుప్పంలో జరిగిన పార్టీ సమావేశంలో ఇంచార్జిలు, కార్యకర్తల మధ్య మాటామాటా పెరగడం ఆందోళన రేకెత్తించింది.
పార్టీ ఓటమికి చంద్రబాబు పీఏ మనోహర్, కుప్పం ఇంచార్జి మునిరత్నమే అంటూ కార్యకర్తలు ఎదురు తిరిగారని తెలుస్తోంది. పార్టీలో ముసలం పుట్టడంతో మునిరత్నం రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. విషయం పార్టీ అధినేతకు తెలియడంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతోపాటు.. పార్టీలోని విబేధాలపై దృష్టిపెడతారని అంటున్నారు.
904114 788760I truly enjoy examining on this internet internet site , it has got fantastic posts . 870224
942709 478759This internet site is actually a walk-through it really may be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll completely discover it. 744910
872423 963997hey there i stumbled upon your site searching about the internet. I wanted to let you know I enjoy the appear of issues around here. Keep it up will bookmark for confident. 558464