హిమాలయ మంచు పర్వాతాల్లో ఏర్పడిన ఓ ప్రమాదకరమైన సరస్సే ఉత్తరాఖండ్ లో సంభవించిన జల ప్రళయానికి కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై.. ఆ సరస్సుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే మరో ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టే విషయంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఆకస్మికంగా వరదలు సంభవించడంతో వందల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ వరదలకు కారణం అక్కడ కొత్తగా ఏర్పడిన సరస్సే అని శాస్త్రవేత్తలు గుర్తించారు.
350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకరమైన సరస్సు ఏర్పడినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారించారు. ఈ హిమానీనదం నుంచి ఓ భాగం కూలిపోవడం వల్లే తాజా ప్రమాదం జరిగనట్టు అంచనా వేస్తున్నారు. ఇది నదివైపు పయనించడంతోపాటు దారిలో ఉన్న భారీ బండరాళ్లు, శిథిలాలు, మట్టిన రిషిగంగా నదిలోకి నెట్టుకొచ్చినట్టు భావిస్తున్నారు. ఫలితంగానే ఆ మార్గంలో ఉన్న రెండు విద్యుత్ కేంద్రాలు మునిగిపోయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సరస్సుకు సంబంధించిన సమాచారాన్ని ఏరియల్ సర్వే ద్వారా సేకరిస్తున్నారు.
241237 892239Wonderful post, Im seeking forward to hear much more from you!! 257768