భార్యపై అనుమానంతో ఆమెకు శీల పరీక్ష చేసాడో భర్త. సలసలా కాగే నూనెలో 5 రూపాయల కాయిన్ వేసి చేతితో తీయాలని ఆదేశించాడు. ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆ ఇల్లాలు చేతితో ఆ కాయిన్ తీసింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్లో జరిగింది. భార్యాభర్తల గొడవతో ఆ ఇల్లాలు ఫిబ్రవరి 11న ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఇంటికొచ్చింది.
తనను కొందరు కచాపురి సెంటర్లో అపహరించారని.. తననేమీ చేయలేదని.. తప్పించుకుని వచ్చేశానని చెప్పింది. ఆమె మాటల్ని నమ్మని భర్త తమ సంప్రదాయం ప్రకారం పాతివ్రత్యం నిరూపించుకోమని ఈ పరీక్ష పెట్టాడు. పైగా.. ఆమె నూనెలో చేయి పెట్టి కాయిన్ తీయడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తాను చేసిన పనిని సమర్ధించుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర శాసనమండలి చైర్ పర్సన్ నీలమ్ గోర్హె స్పందిస్తూ అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Nashik , It has been revealed that the same caste panchayat has ruled that a woman with suspicion should be boiled in boiling oil.
The husband took a video of the incident and made it viral. pic.twitter.com/eUz5bTmKbp— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) February 20, 2021
604299 111082Following study a handful of the content within your internet internet site now, and that i genuinely such as your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls look into my site as effectively and tell me what you believe. 999857