ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాన నరేంద్ర మోడీ ఈ బహిరంగ సభలో, ఆంధ్ర ప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన వైసీపీ చీడను వదిలించబోతున్నాయని, మూడు పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నోట డబుల్ ఇంజిన్ సర్కార్ మాట వచ్చింది. ఏపీ మంత్రులు, అవినీతిలో పోటీ పడుతున్నారని నరేంద్ర మోడీ ఆరోపించారు.
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్.. రెండూ వేర్వేరు కాదని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. అవినీతి పీడను వదిలిస్తామనీ నరేంద్ర మోడీ నినదించారు. అయితే, నరేంద్ర మోడీ చేసిన విమర్శలు, వైసీపీకి మరీ అంత గట్టిగా తగల్లేదా.? తగిలినా, తగలనట్టు వైసీపీ బుకాయిస్తోందా.? అంటే, బుకాయిస్తోందన్నదే నిజం.
ఔను, ‘వైసీపీ మీద నరేంద్ర మోడీ ఘాటైన విమర్శలు చేయలేదు. దాంతో, టీడీపీ అలాగే జనసేన షాక్కి గురయ్యాయి..’ అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వైసీపీ మద్దతుదారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీని నరేంద్ర మోడీ ఏ భాషలో తిడితే బావుంటుంది.? కొడాలి నాని భాషలోనా.? అనిల్ కుమార్ యాదవ్ భాషలోనా.? లేకపోతే, రోజా భాషలోనా.? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ ఎలా కోరుకుంటే, అలా అటువైపు నుంచి దిగజారుడు వ్యాఖ్యలు రావాలనుకోవడం హాస్యాస్పదం.
తోలు మందం వైసీపీకి, ఆ స్థాయి తిట్లు మాత్రమే బాగా ఎక్కుతాయేమో అనిపిస్తోంది కదూ.? అంతే మరి, లేకపోతే.. ‘అంతలా ఏమీ వైసీపీని తిట్టలేదు మోడీ..’ అని వైసీపీ బుకాయించడమేంటి.?
నానాటికీ వైసీపీ దిగజారిపోతోంది.. తోలుమందం పార్టీ అయిపోయింది.! ఫ్రస్ట్రేషన్ అనాలా.? ఓడిపోతామని తెలిసి నిర్వేదం అనాలా.? ఇదీ వైసీపీలోనే, వైసీపీ అధినాయకత్వం తీరు పట్ల అంతర్గతంగా జరుగుతున్న చర్చ.