జగన్ తీసుకునే నిర్ణయాలు ఎవరికి అంతుపట్టకుండా ఉంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. నిర్ణయం తీసుకొని జీవో రిలీజ్ చేసే వరకు కూడా బయటకు సమాచారం ఉండదు. తీసుకునే నిర్ణయంపై ఒకటికి నాలుగు సార్లు అలోచించిన తరువాత కరెక్ట్ అనుకుంటేనే జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇలాంటి నిర్ణయాలలో ఒకటి రాజస్థాన్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ ను ఏపీ కి రప్పించడం. ఈ రిటైర్డ్ మాజీ ఐఏఎస్ అధికారిని జగన్ ప్రభుత్వం ఆర్ధిక సలహాదారుడిగా నియమించింది.
నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయన్ను నియమించుకుంది. అంతేకాదు, ఆయనకు కేబినెట్ హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు అయన ఈ పదవిలో ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధికంగా వనరులు ఎలా సమకూర్చుకోవాలి. ఎలా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి… నిధుల సమీకరణ ఎలా అనే విషయాలపై అయన సలహాలు సూచనలు చేస్తుంటారు.
ప్రభుత్వం సలహాదారులుగా ఎంతమందినైనా నియమించుకోవచ్చు. అయితే, ఏరికోరి రాజస్థాన్ కు చెందిన సుభాష్ చంద్ర గార్గ్ ను తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలుసుకోవాలి. సుభాష్ చంద్ర గార్గ్ గతంలో కేంద్రంలో వివిధ శాఖల్లో పనిచేశారు.
కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అలానే ప్రపంచ బ్యాంగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా అయన పనిచేశారు. ఈ అనుభవం ఆంధ్రప్రదేశ్ కు అవసరం అవుతుందని చెప్పి జగన్ ఆయన్ను ఏరికోరి ఏపీకి తీసుకొచ్చారు.
451567 416656I like this internet website because so a lot utile stuff on here : D. 585599
923676 743346Ill appropriate away grasp your rss feed as I cant in finding your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me understand so that I may possibly subscribe. Thanks. 490545
629679 484069hi!,I like your writing so a whole lot! share we communicate far a lot more about your article on AOL? I want a specialist on this region to solve my difficulty. Could be thats you! Seeking forward to see you. 293944