వైకాపా మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకొచ్చినపుడు గంటా శ్రీనివాసరావు విశాఖ టిడిపి నేతలతో కలిసి హడావుడిగా అక్కడి ఓ హోటల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకాపాకు అనుకూలంగా మాట్లాడారు. మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు గంటా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ… అయన నియోజక వర్గంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా తెలుగుదేశం పార్టీ లో జాయిన్ కావడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విశాఖలో తిరుగుండదని అనుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకున్న సమయంలో గంటాకు జగన్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. విశాఖలోని గంటా నియోజక వర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పచ్చ కండువా ను పక్కన పెట్టి వైకాపా కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నేతలు సడెన్ గా ప్లేట్ ఫిరాయించి వైకాపాలో జాయిన్ కావడంతో గంటాకు మింగుడు పడటం లేదు.
ఎందుకు ఇలా జరిగిందో తెలియక హడావుడిగా పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగానే మేల్కొని సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఉంటె కొంత బాగుండేది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత నష్ట నివారణ చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంటుంది. ఏ నియోజక వర్గంలోని కార్యకర్తలనైనా ఈజీగా బయటకు తీసుకురావొచ్చు. కానీ, గంటా కోటలో అలా కుదరదు. అలాంటిది జగన్ చేసి చూపించారు. ఇది తెలుగుదేశం పార్టీకి అదిరిపోయే దెబ్బ అని చెప్పాలి. మరి దీనిపైన గంటా, తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
972909 976444I like this blog so much, saved to my bookmarks . 375822
341638 506587As I internet internet site possessor I believe the content material matter here is rattling magnificent , appreciate it for your hard work. You must maintain it up forever! Greatest of luck. 870947
93655 850810Wow, superb blog layout! How long have you been blogging for? you make blogging look effortless. The overall look of your site is magnificent, as nicely as the content! xrumer 645002